Friday, July 17, 2015

ఈ రెండు తరగతుల వాళ్ళు నేటి సమాజానికి చెడుపే..

కనీసం శ్రీసూక్తం, పురుషసూక్తం, రుద్రం నమకం చమకం స్వరదోషాలు లేకుండా పఠించలెని వాళ్ళు నిత్య త్రిసంధ్యలలో గాయత్రీ చెయ్యని వాళ్ళు, కనీస ప్రమాణాలు పాఠించని వాళ్ళు, యగ్నోపవీతముతో మధ్య మాంసాలు, గుట్కా సిగరెట్లు సేవించే వాళ్ళు నేడు హిందూమతం పేరుతొ అమాయక ప్రజల్ని పండితులమని మోసం చెయ్యడం, శాపనార్ధాలు పెడుతూ ప్రజల్ని భయపెట్టి బ్రతకే వాళ్ళు,
కనీసం రిపోర్టింగు ఎలా చెయ్యాలో, ఎలా వ్రాయాలో, ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళు, ఏది వార్తో, ఏది కాదో తెలియని వాళ్ళు జర్నలిజం అంటే కనీస అవగాహన లేకుండా సరైన చదువు సంధ్యలు లేకుండా మెడలలో మూర్చరోగి వేసుకున్నట్టు ఒక కార్డు వేసుకుని ప్రెస్ అని జర్నలిష్టునని సమాజాన్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తూ బ్రతకే వాళ్ళు,
ఈ రెండు తరగతుల వాళ్ళు నేటి సమాజానికి చెడుపే...... సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.