Friday, July 17, 2015

తిలాపాపం తలా పిడికెడు.

గేదోడు గేదకి ఏడిస్తే, తోలోడు తోలుకి ఎడ్చాడని ఒక సామెత, ఆ సామెత నేడు రాజమండ్రి పుష్కర దుర్ఘటనలో నిజమని నిరూపించబడింది.
ప్రభుత్వం తన పరాజయాలను తప్పిదాలను కప్పి పెట్టుకోవడానికి 1500 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ పుష్కరాల అతి ఆడంబర ప్రచారముతో లబ్దిపొందాలని చూసింది, తెలుగు వార్తా చానెళ్ళు పత్రికలూ ప్రభుత్వం నుండి ప్రకటనలు ఆశించి కావలసిన దానికంటే ఎక్కువ ప్రచారం కల్పించాయి.ప్రజల్ని జాగారూకులు చెయ్యాల్సిన ఈ రెండు వ్యవస్థలు కూడా ప్రజల్ని ఇంకా తప్పుదోవ పట్టించి మూదులుగా తయారు చెయ్యడములో విజయం పొందినాయి.
ప్రభుత్వం అక్కడ కల్పింహ్చే ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక అదనపు డీజీపీ స్థాయి అధికారిని శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి, ఒక ప్రతేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని అక్కడ ఇతర అన్ని ఎర్పాతులు పర్యవేక్షించడానికి నియమించి, ఒక్కొక్క ప్రధాన ఘాట్ దగ్గర ఒక ఆర్డీవో ని , ఒక అదనపు ఎస్పీ ని నియమించి వారికి తగిన సిబ్బందిని ఇచ్చి ఉంటె ఇటువంటు దుర్ఘటన జరగడానికి అవకాశం ఉండేది కాదేమో.
ఇప్పుడు తక్షణం ప్రభుత్వం ఉపెక్షించకున్దా మీనా మేషాలు లెక్కించకుండా బాధ్యులైన అధికారుల మీద మంత్రుల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద హత్య కేసులు నమోదు చెయ్యాలి.
ప్రతి తార్పుడు గాడు, బ్రోకరు గాడూ నేడు చానెళ్ళు పెట్టి వాళ్ళ చీకటి వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయ నాయకులను అధికారులను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళను లొంగ దీసుకుని సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్నారు. ఈ మీడియా గుప్పెట్లో న్యామూర్తులు కూడా చిక్కుకుంటున్నారు, ఇదే మీడియా నేడు మతాన్ని మత విశ్వాసాన్ని కూడా వాళ్ళ వ్యాపార వస్తువుగా మార్చుకుని కొంతమంది వెధవల్ని మహా పండితులుగా స్వామీజీలుగా పీఠాధిపతులుగా చూపించి / తయారుచేసి వాళ్ళ ద్వారా అనైతిక వ్యాపారాలు చేసుకుంటున్నారు. సమాజాన్ని దోచుకుని దేశాన్ని కొల్లగోట్టుకుని, పాపాలు చేసి కొంపలు ఆర్పిన రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, స్మగ్లర్లు, చానెళ్ళ అధినేతలు, దొంగ పీఠాధిపతులు, నికృష్ట పండితులు, వ్యభిచారులు, జర్నలిష్టులు, దొంగసారా ఎర్రచందనం గంజాయి వ్యాపారస్తులు, డాక్టర్లు, లాయర్లు అందరు గోదావరిలో మునిగేసి వాళ్ళు చేసిన పాపాలు వదిలించుకోవడానికి రావాలను కోవడం మన హిందూమత దరిద్రం.
ప్రతి నిత్యమూ తెలుగు కిరాయి చానెళ్ళు పెట్టగానే పైసాకి కూడా పనికిరాని దొంగ ముండా కొడుకులు కాషాయం కట్టి స్వాములుగా పీఠాధిపతులుగా మారి పెద్ద అంచు పట్టు పంచెలు లాల్చీలు కట్టుకుని అడ్డ బొట్లు నిలువు బొట్లు పెట్టుకుని కూర్చుని ఆ తార్పుడు చానెళ్ళ ద్వారా అమాయక ప్రజలలో అజ్ఞానాన్ని నింపుతూ ప్రజల నమ్మకముతో వ్యాపారాలు చేసుకుంటూ హిందూమతము అంటే జుగుప్స కలిగే విధముగా మార్చేసారు. నేడు అదే చానెళ్ళు 40 అమాయక నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. అసలు పుష్కరాలే వేద ప్రమాణాలు కావు, అటువంటిది ఒక వర్గము మాత్రమె వాళ్ళ వర్గ ప్రయోజనాల కోసం పుష్కర స్నానాలు చేసే ముందు ఒకడు నదిలోకి మట్టి విసర మంటాడు , ఒకడు బంగారం విసర మంటాడు, ఒకడు పట్టు బట్టలు విసరమంటాడు, ఒకడు ఇంకా ఏదేదో విసరమంటాడు, ఒకడు ఇదే రోజు స్నానం చేయ్యాలంటాడు, ఇంకొకడు అదే రోజు ఇంకో విధంగా చేస్తే మనకు కనిపించని ముక్కోటి దేవతలు వరాలు ఇస్తారు అని అంటాడు. ఒక్క చానెల్ కూడా ఇవన్నీ తప్పని ఇలా చేస్తే నది కలుషితం అవుతుందని చెప్పడానికి సాహసం చెయ్యలేదు.
అసలు నిన్న రాజమండ్రిలో జరిగిన 40 మంది హత్యాకాండకు బాధ్యులుగా తెలుగు చానెళ్ళలో రోజు కనిపింస్తు వేద శాస్త్ర ప్రామాణికం కాని పిచ్చి కూతలు కూసే పండితులను పీఠాధిపతులను అవి ప్రసారం చేసే చానెళ్ళ యాజమాన్యాలను గుర్తించి వాళ్ళ మీద హత్య కేసులు నమోదు చెయ్యాలి.
సందట్లో సడేమియా లాగా శవాల మీద పేలాలు ఏరుకోవడానికి దౌర్భాగ్య కాంగ్రెస్ బానిసలు నోళ్ళు లేపుతున్నారు, వాళ్లకు తోడూ నరహంతక ప్రతిపక్ష నాయకుడు తయారయ్యాడు, వీళ్ళకు తోడు విశాఖపట్నానికి చెందినా సినిమా టిక్కట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని బ్రతికి నేడు కాషాయం కట్టి నేను ఒక పీఠాధిపతిని అని చెప్పుకుంటూ మరొక అవకాశవాది పైరవీకారుడు, ఒక కుల వ్యతిరేకి తయారయ్యాడు. 
ఈ దుర్ఘటనలో తిలాపాపం తలా పిడికెడు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.