Sunday, July 19, 2015

అమాయక ప్రజల నమ్మకాల మీద జరుగుతున్న దోపిడీ

అమాయక ప్రజల నమ్మకాల మీద జరుగుతున్న దోపిడీ. ఎవరి నమ్మకాలు ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి అని కాదని ఎవ్వరు అడ్డు చెప్పడములేదే..! అలాగని వాటి చాటున నిజాల్ని కప్పి పెట్టాలనుకోవడం మూర్ఖత్వమే కదా ..! ఆ నిజాలు ఎవరికి తెలిసినవి వాళ్ళు చెబుతారు, ఇష్టం ఉన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు వినరు, అందులో గొడవలు పడాల్సిన అవసరము లేదు.
సకానాతన వైదిక  శాస్త్రం ప్రకారం  నూటికి నూరు శాతం నేటి పుష్కర స్నాన వేలంవెర్రి తిరునాళ్ళు మాత్రమె, ఇది మూర్ఖత్వమే,
వైదిక సంప్రదాయం ప్రకారం పుష్కర స్నానాలు కేవలం సన్యాసులకు,ఋషులకు,  పితురులకు పిండ తర్పణాల కు మాత్రమె పరిమితం.
నేడు టీవీలలో నిత్యమూ ప్రవచనాలు చెప్పే పండితులు పీఠాధిపతులు ఎవరైనా సరే వేదాలలో గీతలో రామాయణ భారతాలలో ( పురాణాలు తప్పించి, పురాణాలు అన్నీ నేటి  నవలలు లాంటి కాల్పనిక కధలే )  ఎక్కడైనా సరే ఈ పుష్కర స్నానాలు మహిళలకు పిల్లలకు తండ్రి బ్రతికి ఉన్న కుమారులకు అని చెప్పబడి ఉంటె అది వాళ్ళు రుజువు చేస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధమే.
అసలు మహిళలకు కొన్ని సందర్భాలలో మాత్రమె నదీ సాగర స్నానానికి అర్హులు,
భర్త బ్రతికి ఉండగా ఏ మహిళా వైదిక సనాతన సంప్రదాయం ప్రకారము ఎత్తి పరిస్థితుల్లోను ఎక్కడా కూడా శిరోముండనం చేయించుకోకూడదు, అది తిరుమల అయినా కూడా.
కానీ నేడు ఈ పండితులు ఒక్కడు కూడా, ఈ పీఠాధిపతులలొ ఒక్కడు కూడా అలా మహిళలు శిరోముండనం చేయించుకోవద్దు అని చెబుతున్నాడా ? టీటీడీ వాళ్లకు ఆ వెంట్రుకల వ్యాపారం కావాలి, ఆ వెంత్రుల వ్యాపారములో అంతర్జాతీయ స్థాయి వ్యాపారులు ఉంటారు , కోట్లాది రూపాయిలు చేతులు మారుతుంటాయి. మరి తిరుమలలోను ఇంకా ఇతర ప్రదేశాలలోనూ భారతీయ హిందూ ముత్తైదు మహిళలు శిరోముండనం చేయించుకోవడం దరిద్రం అని, అలాంటి మహిళలను వాళ్ళ మోఖాలను  పురుషుడు / భర్త చూడకూడదు అని చెబుతున్నారా ?
బహిష్టు ఉన్న మహిళలు, మైల ఉన్న మహిళలు,కుటుంబాలు అస్సలు నదిలోకి సముద్రములోకి కాలు పెట్టకూడదు అని కదా మన శాస్త్రాలు చెప్పేది, నేడు పుష్కర స్నానాలు ఆచరిస్తున్న వాళ్ళలో ఎంతమంది ఇలా ఉండి ఉంటారు ? చెప్పగలరా ?
దీన్ని టీవీలు స్వామీజీలు పీఠాధిపతులు ప్రవచనకారులు పండితులు కలిసి అమాయక ప్రజల నమ్మకం మీద చేస్తున్న కోట్లాది  రూపాయిల ఆధ్యాత్మిక వ్యాపారము కాదా ? దీని వలన ఎవరికి చెడు ? ఎవరికి మంచి ?
ఈ విషయాల మీద నేటి సనాతన వైదిక పండితులు ఘనాపాఠీలు స్వామీజీలు పీఠాధిపతులు  శాస్త్ర ప్రకారం చర్చలకు  మీరు నేడు వాడుకున్న వాడుకుంటున్న చానెళ్ళలో ప్రత్యెక లైవ్ కార్యక్రమములో సిద్ధపడితే మేము సిద్ధమే.
మేము మా శాస్త్ర ప్రమాణాలు ఓడిపోతే / వీగిపోతే మీరు వేసే ఎటువంటి శిక్షకు అయినా మేము అర్హులమే, అలాగే మేము ఒక కోటి రూపాయిలు మీకు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే, ఒకవేళ మీరు ఓడిపోతే మీరు ( స్వామీజీలు పీఠాధిపతులు పండితులు ప్రవచానకారులు మరియు చానెళ్ళ అధిపతులు ) తెలుగు  సమాజానికి క్షమార్పణ చెబితే చాలు. ఆ కిరాయి చానెళ్లకు ఆ ప్రసారాల కిరాయి కూడా మేమే భరిస్తాం .
ఎవరైనా సరే,( ఇందులో ముఖ్యంగా శ్రీ చాగంతో కోటేశ్వరరావు గారు, శ్రీ పరిపూర్నానంద గారు, శ్రీ స్వరూపానంద గారు, శ్రీ చిన జియ్యరు గారు మరియు ఇతర ప్రతిరోజూ సనాతన ధర్మమూ మతము పేరుతొ టీవీలలో సొల్లు కక్కే  చిల్లర ప్రవచానకారులు అందరు పాల్గోనాల్సిందే ) చర్చకు సిద్ధపడి ముందుకు వస్తే సంప్రదించండి. ఈ చర్చలో మీరు  గెలిస్తే  మీకే మంచిది, మన సనాతన ధర్మానికే మంచిది, మన హిందూ మతానికే మంచిది.
ఇట్లు
సనాతన ధర్మాన్ని, వైదిక సంప్రదాయాన్ని పాటించే హిందూ బంధువులకు అందరికి నమస్సుమాంజలితో,
మీ సువేరా 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.