Thursday, October 22, 2015

ఆంధ్రుల ఆత్మగౌరవం ఉందా ..?

ఆత్మగౌరవం ఆత్మాభిమానం పౌరుషం సిగ్గు ఎగ్గు ఏమాత్రం లేని ( మరచిపోయిన ) చేవ చచ్చిన దళారీ మనస్కులైన ( బ్రోకర్లు ) ఆంధ్రులకు స్పెషల్ స్టేటస్ , స్పెషల్ ప్యాకేజ్ లాంటివి ఏమీ ఇవ్వకపోయినా ఆ ఆంధ్రా బానిసలు ఏమీ పీకలేరని, ఆంధ్రులు వాజమ్మలని, దద్దమ్మలని, చవటలని, చేతగాని వెధవలని  దిల్లీకి బాగా తెలుసు.
పోరాటం అంటే ఏమిటో తెలియని ఆంధ్రులకు, అవసరాల కోసం ఎంతకైనా దిగజారే ఆంధ్రులకు ఏమీ ఇవ్వాల్సిన పనిలేదని, వాళ్ళు ఎలాగైనా ఎక్కడైనా బ్రతకగలరని దిల్లీకి బాగా తెలుసు.
వెన్నెముక లేని బానిస ఆంధ్రులు వాళ్ళ స్వార్ధం కోసం  ఎంతకైనా దిగాజారతారని, వాళ్ళు ఏమి చెయ్యమన్నా చేస్తారని, వాళ్ళ బ్రతుకుదెరువుకి  ఎవరినైనా పోగుడుతారని, ఎవరినైనా తిడతారని, వాళ్లకు సిగ్గు ఎగ్గు పౌరుషం ఏమాత్రం మచ్చుకైనా లేవని  ఇంటిలిజెన్స్ ద్వారా దిల్లీకి ఏనాడో సమాచారం చేరింది. దాని యొక్క రుజువే గత దశాబ్దంగా తీవ్రమైన పరుషమైన భాషతో ఆంధ్రులను ఆంధ్రా మహిళలను పిచ్చి తిట్టులు, కారు కూతలు కూసిన కెసీఆర్ ని అధికార పక్షం ఆహ్వానించడం, దాన్ని ప్రతిపక్షం కానీ లేదా  ఏ ఒక్కరు వ్యతిరేకించక పోవడం, అతని పేరు శిలాఫలకం మీద వెయ్యడం, అతనికి స్వాగత బ్యానర్లు పెట్టడం , అతను మాట్లాడుతుంటే చప్పట్లు ఈలలు వెయ్యడం నిదర్శనం. నేడు ఆంధ్రాలో అధికారపక్షం ఒక బానిసల సమూహం, ప్రతిపక్షం ఒక శిఖండి. ఆంధ్రాలో ప్రతిపక్షం  అది ఒక లంపెన్ గ్యాంగు, అది ఒక అరాచకుల, సంఘ వ్యతిరేకుల వేదిక, ఆ నాయకుడు ఒక మాఫియా లేదా ఒక నేరసామ్రాజ్య డాన్ మనస్కుడు.
రాజకీయంగా దేశములో ఎంతో చైతన్యవంతమైనది అని చెప్పుకునే విజయవాడ లో నేడు ఈ పరిస్థితి దాపురించడం బానిస దళారీ ఆంధ్రుల మానసిక పరిస్థితికి నిదర్శనం.
కనీసం విజయవాడలో గానీ ఆంధ్రాలో గానీ ఒక్కడంటే ఒక్కడు ( రాజకీయనాయకుడు లేదా పౌర సమాజం ) కెసీఆర్ రాకను ఖండించడం గానీ , వ్యతిరేక ప్రదర్శనలు చెయ్యడం గానీ మనము చూడలేకపోయాము. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ ఊదరగొట్టే  ఈనాడు రామోజీరావు  కూడా నలుగురు మధ్య ( బీజేపీ తెదేపా వైసీపీ టీఆరెస్ ) ఒక దళారీలాగా ప్రవర్తించి రాజీలు చేసాడు. మరి ఈయనకు ఆత్మగౌరవం అంటే అర్ధం తెలుసా ..? ఈయనకు అసలు
ఆత్మగౌరవం  ఉందా ..?
ప్రతిపక్షం కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రవర్తించింది. జగన్ కి కెసీఆర్ కి మధ్య ఉన్న సత్సంబంధాలు వలన ఒక జాతిద్రోహి ఒక జాతి విద్వేషి వస్తుంటే అడ్డుకోలేకపోగా కనీసం ఖండించను కూడా ఖండించలేదు.
కనీసం .. ఆంధ్రులు తమిళులను ఆదర్శంగానన్నా తీసుకోలేదు. శ్రీ లంక మాజీ అధ్యక్షుడు శ్రీ రాజపక్సే తిరుమలకు వస్తుంటే తమిళులు వారి రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి తిరుమలలో శ్రీ రాజ పక్సేకి వ్యతిరేకముగా నిరసనలు చేసారు. నిన్న కనీసం అలాని వ్యతిరేక ప్రదర్శనలు కాదు కదా అతనికి కొంతమంది విజయవాడలోని తార్పుడుగాళ్ళు, బ్రోకర్లు , బానిసలు స్వాగత తోరణాలు కటౌటులు పెట్టడం సిగ్గు చేటు, శ్రీ కెసీఆర్ మాట్లాడుతుంటే కనీసం పదిమంది లేగిచి నిలబడి నిరసన కూడా వ్యక్తం చెయ్యకపోవడం ఆంధ్రుల దౌర్భాగ్యం.
ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదముతో స్థాపించిన తెదేపా అధికార పక్షములోని వారు ఒకాదంటే ఒక్కడు కూడా తమ నాయకుని చేష్టలని ప్రశ్నించకపోవడం, నిరశించాకపోవడం  వాళ్ళ బానిస భావదారిద్ర్యం.
మరి ఆరోజులలో ఈ వెధవలు అందరు సమైక్యం పేరుతొ ధర్నాలు నిరసనలు నిరాహారా దీక్షలు ఎందుకు చేసారు ? ఎవరిని మోసం చెయ్యడానికి చేసారు ?  మరి ఆరోజులలో కెసీఆర్ కి వ్యతిరేకముగా ఎందుకు ప్రజల్ని రెచ్చగొట్టారు ? హైదరాబాదులోని ప్రజల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి మీరు అందరు చేసిన డ్రామాలు / నిర్వాకాలు ఏమిటి ? ఇలా చేసిన ఈ రాజకీయనాయకుల, నేడు అధికార ప్రతిపక్షాల  వీళ్ళ పుట్టకే ప్రశ్నార్ధకం, వీళ్ళ తల్లులు మాత్రమె సత్యం. ఇలా తెలుగుజాతిని వంచనకు గురిచేసిన వీళ్ళు వీళ్ళ తరతరాలు సర్వనాశనం కాక తప్పదు. ఆత్మగౌరవం పౌరుషం పోరాటం అనేవి మరచిన  ఈ ఆంధ్రుల భవిష్యత్తు కూడా వంచనకు గురికాక తప్పదు .... సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.